అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :
అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజా ప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, గ్రామ సర్పంచ్ మల్లేష్, సీనియర్ నాయకులు పట్నం రాజు, మాణిక్ యాదవ్, శ్రీకాంత్, గ్రామ ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.