కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

Hyderabad politics Telangana

అమీన్పూర్

అర్హులైన ప్రతిఒక్కరికీ వ్యాక్సినేషన్ అందించాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పెషల్ డ్రైవ్ ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట, అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పిఎన్ఆర్ టౌన్ షిప్ లో ఏర్పాటుచేసిన  స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఇప్పటివరకు వ్యాక్సిన్ వేయించుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, సర్పంచులు కృష్ణ, భాస్కర్ గౌడ్, పాండు, మల్లేష్, కౌన్సిలర్లు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *