వైకుంఠధామం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

Hyderabad politics Telangana

పటాన్చెరు

పటాన్చెరు మండల పరిధిలోని రామేశ్వరం బండ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్న ట్లు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం రామేశ్వరంబండలో వైకుంఠధామం నిర్మాణ పనులకు స్థానిక సర్పంచ్ ధరణి అంతి రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో వైకుంఠ దామాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు

.

నియోజవర్గంలో ఇప్పటికే దాదాపు అన్ని గ్రామాల్లో వైకుంఠ దామాలు పూర్తయినట్లు తెలిపారు. రోజు రోజుకీ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్న రామేశ్వరం బండ లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామ పరిధిలో ఏర్పాటుచేసిన వినాయక మండపాలను ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బన్సీలాల్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, అంతి రెడ్డి, గ్రామ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *