గడ్డపోతారం మున్సిపాలిటీలో 15 కోట్ల రూపాయల అభివృద్ధి పంటకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ 

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , గడ్డ పోతారం:

పటాన్ చెరు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన ప్రతి మున్సిపాలిటీని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం గడ్డ పోతారం మున్సిపల్ పరిధిలోని మాదారం, లక్ష్మీపతిగూడెం, వావిలాల, గడ్డ పోతారం, అల్లి నగర్, కిస్టాయపల్లి, ఖాజీపల్లి, జిఎంఆర్ కాలనీలలో 15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు స్థానిక మున్సిపల్ పాలకవర్గం సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. హాజరైన మున్సిపల్ చైర్మన్ సుష్మ గణేష్, వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *