అంతర్గత మురుగునీటి కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన
పటాన్చెరు
జిహెచ్ఎంసి పరిధిలోని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాయిరాం కాలనీ, ఆల్విన్ కాలనీ లో రెండు కోట్ల 43 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్గత మురుగునీటి కాలువల పనులకు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతనంగా కాలనీలు ఏర్పడుతుందని అన్నారు. ప్రతి కాలనీలో మురుగునీటి కాలువలు, వీధి దీపాలు, అంతర్గత రహదారుల నిర్మాణానికి ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, విజయ్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బల్దియా అధికారులు పాల్గొన్నారు