పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
ఇటీవల ఉగాండా దేశంలోని కంపాలలో జరిగిన వరల్డ్ టెన్నిస్ టూర్ ( ఐటీఎఫ్ ) జూనియర్ సర్క్యూట్ (జే30) అండర్ 18 డబుల్స్ విభాగంలో విజేతగా, సింగిల్స్ విభాగంలో రన్నర్ గా నిలిచిన నూకల షన్వితా రెడ్డిని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అభినందించారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని తన నివాసంలో షన్వితా రెడ్డికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచ వేదికపై ఇనుమడింపచేయడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షన్విత రెడ్డి తండ్రి పటాన్చెరు సిఐ నూకల వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
