శేరిలింగంపల్లి :
హైదరాబాద్ లోని ప్రముఖ ఫ్యాషన్ ఏజెన్సీ మిస్ అండ్ మిస్టర్ అర్బన్ ఇండియా 2021 పోటీలు మాదాపూర్ లోని బ్యాంకెట్ హాల్ లో శనివారం నాడు అట్టహాసంగా నిర్వహించింది. దీనికి సంబంధించిన నాలుగు ఎడిషన్లు కరోనా లాక్ డౌన్ కారణంగా ఆన్లైన్ లో నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు శరకడం శ్రీనివాస్ తెలిపారు. దేశవ్యాప్తంగా 300 మంది ఆడిషన్స్ లో పాల్గొనగా ఈ ఫైనల్ లో 50 మంది మోడల్స్ సెలక్ట్ అయ్యారు.సినీ నిర్మాత రియల్ ఎస్టేట్ సంస్థ అధిపతి విజయ్ పాల్ రెడ్డి విజేతలకు మెమొంటోస్ మరియు సర్టిఫికెట్ అందజేశారు .
న్యాయ నిర్ణేతలు గా మిస్సెస్ అర్బన్ 2019లో విజేత శ్రీవాణి, మ్యూజిక్ డైరెక్టర్ మోహిని మృదుల్ ,ఫ్యాషన్ డిజైనర్ దీపాలి మెహతా,సెలబ్రెటీ కొరియోగ్రాఫర్ నరసింహా రెడ్డి పాల్గొన్నారు .నిర్వాహకుడు శరకడంశ్రీనివాస్ మాట్లాడుతూ మా సంస్థ తరఫున ఇది 31 ఈవెంట్ ని అని ఈ సందర్భంగా ప్రస్తావించారు సుమారు వందమందికి పైగా పలు సినిమాలు ,వెబ్ సిరీస్ లో అవకాశాలు పొంది ఉన్నారని ఆయన అన్నారు