నందన్ రతన్ ప్రైడ్ కాలనీలో అంతర్గత డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

Hyderabad Telangana

 డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

పటాన్చెరు లోని నందన్ రతన్ ప్రైడ్ కాలనీలో కాలనివాసుల సొంత నిధులతో నిర్మించుకుంటున్న అంతర్గత డ్రైనేజీ పనులను కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ కాలనీవాసులు సమైక్యంగా సొంత నిధులతో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం హర్షణీయమన్నారు .

తాను కూడా ఈ పనులకు తనవంతు సహాయం అందిస్తామన్నారు కాలనివాసులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో పాటు తాను ఎల్లపుడూ అందుబాటులో ఉంటామని ఏ అవసరమైన తమను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ రమణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వర రెడ్డి, జనరల్ సెక్రెటరీ శివకుమార్, ట్రేసరార్ సురేష్, మహేష్, కాలనీ సభ్యులు అశోక్,డీకే హుస్సేన్,దిలీప్ గౌడ్,శివనాగ్,శ్రీధర్,శ్రీనివాస్ రెడ్డి,నాగరాజు, నంది రెడ్డి,ప్రవీణ్ రెడ్డి, మనీష్ లతో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *