అభివృద్ధి కోసమే కలిశాను _ఎమ్మెల్యే జిఎంఆర్ వివరణ

politics Telangana

_సీఎం రేవంత్ రెడ్డితో భేటీ పై ఎమ్మెల్యే జిఎంఆర్ వివరణ

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని, ఈ అంశంపై అనవసరంగా ఊహగానాలు సృష్టించవద్దని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డిని కలవడాన్ని ఆయన ఒక ఉదాహరణగా తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ స్థానంలో గులాబీ జెండా ఎగరవేయబోతున్నామని తెలిపారు. ఇకనైనా అవాస్తవ ప్రచారాలు, ఊహగానాలకు పుల్ స్టాప్ పెట్టాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *