ఆర్ కృష్ణయ్యను సన్మానించిన విశ్వబ్రాహ్మణ సంఘం…

politics

శేరిలింగంపల్లి:

విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ హక్కుల సాధన కొరకు ఈ నెల 23, 24 తేదీలలో రెండురోజుల పాటు జరగనున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి విచ్చేసి, తమ మద్దతు తెలపాలని కోరుతూ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ హక్కుల సాధన కమిటీ సభ్యులు వడ్ల సుదర్శన చారి, కంజర్ల కృష్ణమూర్తి చారి, బచ్చల పద్మ చారి, పొన్నాల శ్యామ్ చారి,రాజేందర్ చారి లు బిసి సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ను, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాసోజు శ్రావణ్ కుమార్ లను సన్మానించారు.

రాష్ట్ర విశ్వబ్రాహ్మణులoదరూ ఇందిరా పార్కు వద్ద జరగనున్న రిలే నిరాహార దీక్ష కు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *