మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం

politics Telangana

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా మొక్కలు నాటుదాం- పర్యావరణాన్ని కాపాడుకుదాం అని విసిహెచ్ గ్రూప్ సభ్యులు అన్నారు. విసిహెచ్ గ్రూప్ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక డివిజన్ పరిధిలోని స్మశాన వాటికలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛమైన వాతావరణం కోసం నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు. భూమండలంపై కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రాణవాయువు శాతాన్ని పెంచేందుకు, వర్షాలు పడేందుకు, విపత్తుల సమయంలో చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ మీసేవ, సంజీవ్ రెడ్డి, రామకృష్ణ, పవన్, రాజు, వీర్, వికాఫ్, విసిహెచ్ గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *