మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :
గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య డైనో మండి రెస్టారెంట్ ప్రారంభం అయింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న అందాల తార భాగ్యశ్రీ బోర్సె చేతుల మీదుగా నాలుగవ బ్రాంచ్ గా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్ గుంటూరులో ఘనంగా ప్రారంభం అయింది. పిల్లలను, పెద్దలను ఆకర్షించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రెస్టారెంట్ అందరిని ఆకర్షిస్తుంది.
ఈ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ మాట్లాడుతూ గుంటూరు ప్రజలందరికి హియ్య డైనో మండి గురించి ముందే తెలుసు, హైదరాబాద్ లో చాలా పాపులర్ అని అన్నారు. ఇక్కడ ఫుడ్ చాలా రుచిగా ఉందన్నారు. అందరూ తప్పకుండా వచ్చి ఒక్కసారి ఆ రుచిని చవిచూడాలని పేర్కొన్నారు. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ వస్తారు, కచ్చితంగా నచ్చుతుందని అన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ వాతావరణాన్ని బాగా ఇష్టపడతారని పేర్కొన్నారు. ఒక ఫ్యామిలీ ఆహ్లాదారకరమైన వాతావరణంలో ప్రశాంతంగా భోజనం చేసేలా ఉందని తెలిపారు. ముఖ్యంగా తన అభిమానులకు హియ్య డైనో మండికి స్వాగతం పలికారు.

గౌతమి చౌదరి మాట్లాడుతూ ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. గుంటూరులో ప్రారంభించిన హియ్య డైనో మండి రెస్టారెంట్ కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బ్యూటిఫుల్ హీరోయిన్ భాగ్యశ్రీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఏషియాలోనే ఫస్ట్ థియేట్రికల్ రెస్టారెంట్ హియా డైనో మండి అని వెల్లడించారు. తక్కువ డబ్బులతో మంచి వాతావరణంలో.. రుచికరమైన భోజనం తినాలి అంటే సరియైన ప్లేస్ లేదని అనిపించి గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను స్థాపించామని తెలిపారు. ఇకపై కుటుంబ సమేతంగా గుంటూరు ప్రజలు వస్తారని, తెలంగాణ, ఆంధ్ర ఏ ప్రాంతం వారైనా గుంటూరుకు వచ్చారంటే హియమండిని సందర్శించండి అని తెలిపారు.
గుంటూరు ఫ్రాంచైస్ ఓనర్ మాట్లాడుతూ గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ఓపెనింగ్ కు వచ్చిన హీరోయిన్ భాగ్యశ్రీ, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. నాలుగు నెలలుగా ఈ రెస్టారెంట్ డిజైనింగ్ కోసం ఎంతో కష్టపడ్డామని తెలిపారు. కానీ ఫైనల్ గా అన్ని విధాల రెస్టారెంట్ అదిరిపోయిందని, ఇక ఫుడ్ విషయంలో టాప్ క్వాలిటీ గా ఉందని తెలిపారు. గుంటూరు ప్రజలు మాత్రమే కాదు గుంటూరుకు వచ్చిన అందరూ హియ్య డైనో మండి రెస్టారెంట్ ఒక్కసారి ట్రై చేస్తే ఎప్పటికీ మర్చిపోరని ఆశాభావం వ్యక్తం చేశారు.
