BHARATHINAGAR

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు 75 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

Hyderabad Telangana

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు
75 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

రామచంద్రపురం

 

భారతి నగర్ డివిజన్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలిపారు. సోమవారం భారతి నగర్ డివిజన్ పరిధిలోని MIG కాలనీలో 75 లక్షల రూపాయలతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని అధికారులకు సూచించారు. థీమ్ పార్క్ పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ తో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి, హెచ్ ఎం డబ్ల్యు ఎస్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *