హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని శాంతి నగర్, చైతన్య నగర్, రాం మందిర్ రోడ్డు, గౌతం నగర్ తదితర కాలనీలతో పాటు మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో గల హనుమాన్ దేవాలయాల్లో నిర్వహించిన హనుమాన్ జయంతి ఉత్సవాల్లో ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భగవాన్ ఆంజనేయుడి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ గాయత్రి పాండు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, రుద్రారం మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, నరసింహారెడ్డి, అశోక్, సీనియర్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.