మనవార్తలు ,శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ కార్పోరేటర్ గా ప్రమాణస్వీకారం చేసి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చి గౌలిదొడ్డి లోని ఆయన కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందు ముందు ప్రజలకు సేవ చేస్తూ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి గారు మాట్లాడుతూ మీ ప్రేమాభిమానాలు ఉంటే ఎలాంటి సేవ చేయడానికయినా తన శక్తిమేర కృషి చేస్తానని అందుకు అందరికి కృతజ్ఞతతో ఉంటానని హామీ ఇచ్చాదు.
అందరి అభీష్టం మేరకు పనిచేస్తూ అందరికి అందుబాటులో ఉంటానని తెలిపాడు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్ గారు, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి గారు, ఎన్టీఆర్ నగర్,తాజ్ నగర్,సోఫా కాలనీ సొసైటీ అధ్యక్షులు బి విటల్ గారు, సీనియర్ నాయకులు శివ సింగ్,మన్నే రమేష్, ప్రసాద్, కిషన్ గౌలి, నర్సింగ్ నాయక్, రంగస్వామి,దుర్గరామ్,ప్రవీణ్,రాజు,శ్రీను, ,యాదయ్య, తదితరులు పాల్గొన్నారు