పటాన్ చెరు:
టైపోలార్ ఫజ్జీ కాన్సెప్ట్ ఆఫ్ నియర్ రింగ్స్ అనే అంశంపై అధ్యయనం , విశ్లేషణ , దాన్ని సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైద్రాబాద్ , గీతం డీమ్ విశ్వవిద్యాలయంలోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని రక్షిత దేశ్ ముఖ్ ను డాక్టరేట్ వరించింది .ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ లోని గణిత శాస్త్ర విభాగం అధ్యాపకుడు డాక్టర్ పి.నరసింహస్వామి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . రక్షిత సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఏ.రామారావు , వివిధ విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
