గీతమ్ ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం….

politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

భారతదేశ తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 147 వ జయంతిని పురస్కరించుకుని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్లోని జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) విద్యార్థులు సోమవారం ‘ ఐక్యతా ర్యాలీ’ని నిర్వహించారు . గాంధీ విగ్రహం నుంచి ఆరంభమై గీతం ప్రాంగణాన్ని చుట్టివచ్చిన ఈ ర్యాలీలో విద్యార్థులు , అధ్యాపకులు , సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు . ర్యాలీ ప్రారంభానికి ముందు విద్యార్థులంతా జాతి ఐక్యత , సమగ్రతను కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు . దేశ ఐక్యతను పెంపొందించడం , భారతదేశ చరిత్రకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి గురించి అవగాహన కల్పించడం ఈ వేడుక ప్రధాన లక్ష్యంగా ర్యాలీకి నాయకత్వం వహించిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ( యూనిట్ -2 ) డాక్టర్ బిజయ కేతన్ సాహు పేర్కొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *