పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి : అయోధ్య లో నూతనంగా నిర్మించిన భవ్య రామ మందిరంలో ఈనెల 22వ తేదీన నిర్వహించనున్న శ్రీ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా.. పటాన్చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, అలంకరణలు, ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.గురువారం ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన..దేవాలయాలతో పాటు ప్రజలందరూ పండగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, కార్పొరేటర్ మెట్టు కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ జెడ్పిటిసి జైపాల్, మాజీ కార్పొరేటర్ సపనా దేవ్, పట్టణ పుర ప్రముఖులు, పాల్గొన్నారు.