– బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికైన విష్ణువర్ధన్ రెడ్డి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికైన విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఎనిమిదవ సారి విష్ణువర్ధన్ రెడ్డి ని అధ్యక్షునిగా, ఉపాధ్యక్షునిగా సూర రెడ్డి, జనరల్ సెక్రెటరీగా అంబ్రిష్, జాయింట్ సెక్రటరీగా రమేష్, ట్రెజరర్ గా మాధవి ,లైబ్రరీ సెక్రటరీగా ఆంజనేయులు, లేడీ రిప్రజెంటేటివ్ గా లలిత,30 ఇయర్స్ స్టాండింగ్ ఈసీ మెంబర్స్ గా వీర మహేందర్,15 ఇయర్స్ స్టాండింగ్ ఈసీ మెంబర్స్ గా గైనోబో, కాజా నిజాముద్దీన్,10 ఇయర్స్ స్టాండింగ్ ఈసీ మెంబర్స్ గా పెంటయ్య, రమాదేవి,5 ఇయర్స్ స్టాండింగ్ కమిటీ ఈసీ మెంబర్లుగా విజయకుమార్, వినోద్ కుమార్ లను ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను న్యాయవాదులు సన్మానించారు.