ఈజీ మనీ…. పెట్రోల్ బంక్ లో మైక్రో చిప్ లతో మోసం

Crime Hyderabad Telangana

హైదరాబాద్

పెట్రోల్ బంక్ లో మైక్రో చిప్ లతో మూడు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠా ను అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. పెట్రోల్ బంక్ లో సాఫ్ట్ వేర్ లను మార్చి ఈ ముఠా మోసాలకు పాల్పడుతుండేవారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక లో కలిపి మొత్తం 34 పెట్రోల్ బంక్ లలో మైక్రో చిప్ ల ద్వారా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక నిందితులను పట్టుకున్న పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా… బాల నగర్ డీసీపీ పద్మజ మాట్లాడుతూ… ఫైజుల్ బారి , సందీప్, ఎండీ అస్లం ముగ్గురు పథకం ప్రకారం మోసం చేస్తున్నారు.

మైక్రో చిప్స్ పెట్టిన నలుగురితో పాటు పెట్రోల్ బంక్స్ యజమానులు నలుగురిని అరెస్ట్ చేశాం.గతంలో పెట్రోల్ బంక్ లో పని చేసిన అనుభవం ఉండడంతో ఈజీ గా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం తో మోసం చేస్తున్నారని అన్నారు.మిషన్ ను ట్యాపరింగ్ చేసి ఓ మైక్రో చిప్ పెట్టి మోసం చేస్తున్నారని…. లీటర్ కి 30 ML వరకు తక్కువ వచ్చేలా ప్రోగ్రాం తయారు చేసి మోసం చేస్తున్నారని అన్నారు. ఇలా మైక్రో చిప్ ను రెండు లక్షలు రూపాయలకు పెట్రోల్ బంక్ డీలర్లు, యజమానులకు అమ్మకాలు చేశారు.

ఇలా వచ్చిన డబ్బుతోటి ఈ ముఠా ఒప్పందం ప్రకారం పంచుకుంటున్నారని తెలిపారు.ఈ ముఠా పై మొత్తం 6 కేసులు నమోదు చేశామని… జీడిమెట్ల, మైలార్ దేవుల పల్లి, మేడ్చల్ , జవహర్ నగర్ లో కేసులు నమోదు చేశామన్నారు. కామారెడ్డి, వనపర్తి, ఖమ్మం , సిద్ధి పేట్, నెల్లూరు , సూర్య పేట్ లో ఇలా మోసం చేస్తున్నారని పద్మజ అన్నారు. కర్ణాటక , ఏపీ లో కూడా ఇలా చిప్ లు అమ్మకాలు చేస్తూ పబ్లిక్ ను మోసం చేస్తున్నారన్నారు.ఇప్పటికే పెట్రోల్ బంక్ డీలర్లు, యజమానులు నలుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *