మనవార్తలు ప్రతినిధి , రామచంద్రాపురం :
సంగారెడ్డి జిల్లా భారతి నగర్ డివిజన్లో DMS సమృద్ధి సంస్థ ఫౌండర్ డా. అశ్లీషా ఏదల గారు ఏర్పాటు చేసిన డిజిటల్ మార్కెటింగ్ ప్రదర్శనశాల ప్రారంభించిన సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి. DMS సమృద్ధి సంస్థ మహిళలకు డిజిటల్ మార్కెటింగ్ లో ట్రైనింగ్ ఇస్తు వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు చేయడం అభినందించిన విషయం. ఈ సంఘం ఎనిమిది సంఘాలు ఏర్పాటు చేసి హైదరాబాదు పరిసర ప్రాంతాలలో మహిళలకు డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలో నేర్పుతూ వారికి ఆర్థికంగా ఎలా ఎదగాలో నేర్పించడం చాలా సంతోషకర విషయం అని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో DMS సంస్థ అధ్యక్షురాలు రమా శ్రీనివాస్, గ్రోత్ ఆఫీసర్ వాసంతి చందా, సుజిత ట్రైనింగ్ ఆఫీసర్ , ట్రెజరర్ అనిత మరియు సభ్యులు జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
