మనవార్తలు , సంగారెడ్డి :
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని 12,19వ వార్డ్ లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహింస్తున్న 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమలో భాగంగా 4వ రోజు బొల్లారం మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి ఇంటింటికి మొక్కలు పంపిణి కార్యక్రమం చేశారు.ఛైర్ పర్సన్ రోజా బాల్ రెడ్డి వార్డ్ ప్రజలతో మాట్లాడి అక్కడి సమస్యలు ఆడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించాలి అని వార్డ్ ఫీల్డ్ ఆఫీసర్ కి అధికారులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజేందర్ కుమార్, వార్డ్ కౌన్సిలర్లు బి.సంధ్య జైపాల్ రెడ్డి, ఏ.బాలమని రత్నం,నాయకులు బి. జైపాల్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ రత్నం, ఫీల్డ్ ఆఫీసర్లు ,స్థానికులు సంతోష్ రెడ్డి,నరసింహ రెడ్డి స్థానిక మహిళలు, తదితరులు పాల్గొన్నారు.