సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Hyderabad Telangana

రామచంద్రపురం

నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎంఆర్ఎఫ్ వరప్రదాయినిగా నిలుస్తోందని భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి అన్నారు రామచంద్రపురం భారతి నగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనికి చెందిన లబ్ధిదారులకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు అనంతరం సింధు ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేద వారికీ వైద్యం అందాలనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకెళ్తున్నారని,మరియుకార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. ప్రధాన ఆసుపత్రుల్లో డయాగ్నొస్టిక్ హబ్ లు ఏర్పాటుచేసి ఖరీదైన వైద్య పరీక్షలు సైతం ఉచితంగా అందిస్తున్నట్లు కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి తెలిపారు.

 

SINDHU.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *