రామచంద్రపురం
సీనియర్ సిటిజన్స్ విషయం లో తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి అన్నారు.భారతి నగర్ డివిజన్ పరిధిలో ఎల్. ఐ. జి కాలనీ వార్డ్ ఆఫీస్ లో సీనియర్ సిటిజన్స్ తోకార్పొరేటర్ సమావేశమయ్యా మాట్లాడుతు సీనియర్ సిటజన్స్ కు ఇచ్చిన హామీలను దశల వారీగా పరిష్కరిస్తామని చెప్పారు.వారికి పెన్షన్స్ మరియు ఇతర సమస్యల ను పరిష్కరిస్తానని అన్నారు.ఎన్నో రోజులు నుంచి పెండింగ్ లో ఉన్నవార్డ్ ఆఫీస్ నిర్మాణం ను డిప్యూటీ కమీషనర్ బాలయ్య గారు స్థలం పరిశీలించారు.
అనంతరం ఎం.ఐ. జి కాలనీ లో మహిళ భవన్ నిర్మాణ పనులను కార్పొరేటర్ గారు పరిశీలించారు. వారు ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేసి నాణ్యత లో రాజీ పడొద్దని వారు కోరారు. వారితో డిప్యూటీ కమిషనర్ బాలయ్య, ఇంజనీరింగ్ అధికారులు ఈ ఈ సత్యనారాయణ ,డి ఈ శిరీష ,ఏఈ ప్రభు, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు మరియు కాలనీ సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు