మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ రాయదుర్గం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గేమ్ ఆన్ క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు మరియు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాలు ముఖ్య అతిదులుగా పాల్గొని క్రికెట్ అకాడమీ నీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు క్రికెట్ ఆడిన అనంతరం మాట్లాడుతూ క్రీడలకు తల్లితండ్రులు బాల్యం నుండే పిల్లలను ప్రోత్సాహించాలని. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి అవసరమైన శిక్షణ ఇవ్వడం ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మొహమ్మద్ తౌఫిక్, అర్జున్ మరియు దారుగుపల్లి నరేష్, శ్యామ్లెట్ పాండు, సలావుద్దీన్, సంజీవ తదితరులు పాల్గొన్నారు.