స్వర్గీయ ప్రవీణ్ గౌడ్ కు జర్నలిస్టుల ఘన నివాళులు…

Districts Hyderabad politics Telangana

పటాన్ చెరు:

నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్ పాత్రికేయ మిత్రుడు, వార్త విలేకరి స్వర్గీయ ప్రవీణ్ గౌడ్ మృతి పాత్రికేయ లోకానికి తీరని లోటని పటాన్ చేరు నియోజకవర్గ జర్నలిస్టులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటివల ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందిన స్వర్గీయ ప్రవీణ్ గౌడ్ కు ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ, పటాన్ చేరు నియోజకవర్గ జర్నలిస్టులు కలిసి పటాన్ చేరు యంపిపి కార్యాలయం వద్ద ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగ పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ… పత్రికారంగంలో ఒత్తిడులను భరించలేని స్థితిలో ఆర్ధిక ఇబ్బందులతో ప్రవీణ్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడం విచారకమన్నారు.సమాజానికి ఎన్నో విధాలా సందేశం ఇచ్చే విలేకరులు ఇలా అధైర్యానికి లోను కాకుండా ప్రతి సమస్యను ఎదుర్కొని ధైర్యంగ ఎదురుకోవాలని, ప్రవీణ్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, జర్నలిస్టులు ఆత్మస్థైర్యం తో ముందుకు సాగాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పటాన్ చేరు జర్నలిస్టులు మిత్రులు యాదగిరి, శ్రీనివాస్ గౌడ్, మోటూరి నారాయణ రావు, చంద్రశేఖర్, నర్సింహ్మచారి, రాజు, బశ్వేశ్వర్ , ఆంజనేయులు, నగేష్ చారి, నరేష్, రాజు,బుక్క శ్రీనివాస్, సంగమేశ్, సతీష్, శివ, సంజీవ, రాము, దశరధ్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *