పాశమైలారం లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

గ్రామాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ, మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం పాశమైలారం గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న సీసీ రోడ్డు పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులు తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ  పటాన్ చెరు నియోజకవర్గం లోని 55 గ్రామ పంచాయతీల పరిధిలో శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.

రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ మోటే కృష్ణ, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామ పంచాయతీ పాలక వర్గం సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *