పెదకంజర్ల గ్రామం లో 50 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

Districts Hyderabad politics Telangana

శరవేగంగా గ్రామాల అభివృద్ధి
ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు

పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం పటాన్చెరు మండల పరిధిలోని పెదకంజర్ల గ్రామం లో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల రూపురేఖలు మారుస్తున్నాయని అన్నారు.

ప్రతి నెల టంచనుగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా సాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రాజ్ కుమార్, ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, గోపాల్ రెడ్డి, గ్రామ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *