నిరుపేదలకు ఆపన్న హస్తం సీఎంఆర్ఎఫ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

_లక్ష 25 వేల రూపాయల ఎల్ఓసి అందజేత

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణానికి చెందిన ఠాకూర్ నరేందర్ సింగ్ ప్రమాదంలో ఎడమ కాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో కృత్రిమ కాలు కోసం స్థానిక ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కృత్రిమ కాలు కోసం మంజూరైన ఒక లక్ష 25 వేల రూపాయల విలువైన ఎల్ఓసి అనుమతి పత్రాన్ని ఆదివారం ఎంఎల్ఏ జిఎంఆర్ నరేందర్ సింగ్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా పాలన అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజన్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *