_పుట్టినరోజు పేదలకు అన్నదానం చేసిన సీనియర్ జర్నలిస్ట్ కొమురవెల్లి భాస్కర్
మనవార్తలు , సుల్తానాబాద్:
అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని సీనియర్ జర్నలిస్ట్ కొమురవెల్లి భాస్కర్ అన్నారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నదానం ద్వారా పేదలకు కడుపు నింపడం ఎంతో సంతోషంగా ఉంటుంది అన్నారు, సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కొమురవెళ్లి భాస్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి భార్య లక్ష్మి కొడుకు కోడలు కొమురవెళ్లి ఆక్షిత-హరీష్.కుమారుడు అభిలాష్.కూతురు అఖిల గార్లు , మరియు కుటుంబ సభ్యులు బుధవారం స్థానిక శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఎదురుగా పేదలకు, అనాధలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గత 433 రోజుల నుండి ఈ అన్నదాన కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది,
