విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం లో ప్రముఖులు….
పటాన్ చెరు:
భానూరు గ్రామపంచాయతీ పరిధిలోని కంచర్లగూడెం లో ఏర్పాటు చేసిన శ్రీ కేతకీ సమేత భ్రమరాంబ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో శాసనమండలి ప్రోటేమ్ చైర్మన్ భూపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలు సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, దేవానందం, జెడ్ పి టి సి లు సుప్రజా వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సర్పంచ్ ఉమవతి గోపాల్, స్థానిక ప్రజా ప్రతినిధులు, తహసిల్దార్ మహిపాల్ రెడ్డి, ఎంపిడిఓ బన్సిలాల్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.