ప్రభుత్వ పాఠశాలల్లో స్టేషనరీ కిట్ల పంపిణీ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : తన నిరంతర దాతృత్వ కార్యక్రమాలు, సమాజాభివృద్ధికి నిబద్ధతలో భాగంగా, హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఇటీవల రుద్రారంలోని ప్రాథమిక పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత స్టేషనరీ కిట్లను పంపిణీ చేసింది.గీతం విద్యార్థులు ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల అభ్యాసకుల విద్యా ప్రయాణానికి మద్దతు ఇవ్వడం, విద్యపై వారి ఆసక్తిని ప్రోత్సహించడం లక్ష్యంగా విద్యార్థులు వారికి అవసరమైన స్టేషనరీ సెట్లతో పాటు నోట్ పుస్తకాలను పంపిణీ […]

Continue Reading

పెన్షన్ పెంపు కోసం మార్చి 13 న ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్షలు

ఛలో హైదరాబాద్ కు వికలాంగులంతా తరలిరావాలి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు పి మేరీ, జయలక్ష్మి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: వికలాంగుల పెన్షన్తో పాటు చేయూత పెన్షన్స్ పెంచాలని డిమాండ్ చేస్తూ మార్చి 13 న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద వికలాంగుల సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామని *వికలాంగుల హక్కుల జాతీయ వేదిక( ఎన్.పి.ఆర్.డి) రాష్ట్ర కమిటీ సభ్యులు పి మేరీ, జయలక్ష్మి తెలిపారు. ఆదివారం వారు పటాన్ […]

Continue Reading

పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం పటాన్ చెరు పట్టణం లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. […]

Continue Reading

మద్దతు కాదు, సమానత్వం కావాలి

గీతం అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో స్పష్టీకరించిన వక్తలు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మహిళలు సమాజ మద్దతును కాక, పురుషులతో పాటు సమానత్వాన్ని కోరుకుంటున్నట్టు గీతం డీమ్డ్ విశ్వ విద్యాలయం, హైదరాబాదులో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో వక్తలు స్పష్టీకరించారు. ‘లాభం కోసం ఇవ్వండి’ (గివ్ టు గెయిన్) అనే ఇతివృత్తంతో గీతం మహిళా సాధికారత సెల్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్యానెల్ చర్చ జరిగింది. ఇందులో వింగ్ కమాండర్లు- దుండిగల్ ఎయిర్ ఫోర్స్ యూనిట్ […]

Continue Reading

మహిళల పట్ల వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం

సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు ఆశాలత ఇష్టా విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ తులసి, రజిత మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మహిళల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు,ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు ఆశాలత,ఇష్టా విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ తులసి, రజిత లు అన్నారు. సిఐటియు, ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో పటాన్ చెరు శ్రామిక్భవన్ లో కేంద్ర ప్రభుత్వ విధానాలు మహిళలపై ప్రభావం అనే అంశంపై నిర్వహించిన సెమినార్ […]

Continue Reading

గీతంలో రోబోటిక్స్, ఏఐ ల్యాబ్స్

లాంఛనంగా ప్రారంభించిన మహీంద్రా సీనియర్ జీఎం అనిల్ కుమార్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:  గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లో రోబోటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) లాబొరేటరీని జహీరాబాద్ లోని మహీంద్రా & మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ ప్లాంటు అధిపతి, సీనియర్ జనరల్ మేనేజర్ (తయారీ) అనిల్ కుమార్ మహేంద్రకర్ శుక్రవారం ప్రారంభించారు.స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ల్యాబ్ భావనను మహేంద్రకర్ ప్రశంసించడమే గాక, పారిశ్రామిక అనువర్తనాలతో విద్యాభ్యాసాన్ని అనుసంధానించడం యొక్క ప్రాముఖ్యతను […]

Continue Reading

ప్రశ్నే పురోగతికి సోపానం

గీతంలో జాతీయ సైన్స్ దినోత్సవంలో సీసీఎంబీ పూర్వ డైరెక్టర్ మోహన్ రావు వ్యాఖ్య  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:  ప్రశ్నించే స్ఫూర్తి, ఉత్సుకత శాస్త్రీయ పురోగతికి సోపానాలని బిట్స్ పిలాని-హైదరాబాదు బయోలాజికల్ సైన్సెస్ విభాగాధిపతి, సీనియర్ ప్రొఫెసర్ ఎమెరిటస్, హైదరాబాదులోని సెల్యులార్, మాలిక్యులర్ బయాలజీ కేంద్రం (సీసీఎంబీ) పూర్వ డైరెక్టర్ సీహెచ్. మోహన్ రావు అన్నారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని గురువారం ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా […]

Continue Reading

హోలీ వేడుకల్లో ఎమ్మెల్సీ దంపతులు

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి స్వగ్రామంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ దంపతులు చిన్నారులు, మున్సిపాలిటీ కార్మికులతో కలిసి హోలీ సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. చిన్నారులు రంగులను చల్లుకుంటూ హోలీ వేడుకలను హోరెత్తించారు. వారి ఇంటి వెళ్లి చిన్నారులు రంగులు పోస్తూ హోలీ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకొని ఆనందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి మాట్లాడుతూచెడు పై సాధించిన […]

Continue Reading

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ఎం.అనూషకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఫార్మాస్యూటికల్ పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థిని ఎం.అనూషను డాక్టరేట్ వరించింది. ‘బయోలాజికల్ మ్యాట్రిక్స్ లో ఎంచుకున్న ఔషధాల అంచనా కోసం ఎల్సీ-ఎంఎస్/ఎంఎస్ పద్ధతుల అభివృద్ధి, ధ్రువీకరణ’ అనే అంశంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఫార్మసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాంరెడ్డి గొడెల మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.అనూష పరిశోధన, […]

Continue Reading

సమిష్టి సహకారంతో ఆదర్శ మున్సిపాలిటీగా ఇస్నాపూర్

ఇస్నాపూర్ మున్సిపాలిటీ తొలి పాలకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు సంక్షేమ.. పథకాలు పారిశుద్ధ్యం, మంచినీరు, విద్యుత్ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నూతనంగా ఏర్పడిన ఇస్నాపూర్ మున్సిపాలిటీని ప్రజా ప్రతినిధులు, ప్రజలు, అధికారులతో కలిసి రాష్ట్రంలోని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం వార్డు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ సుమలత అధ్యక్షతన […]

Continue Reading