పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
ఏక్ దేశ్ మె..దో నిషాన్, దో విధాన్, దో ప్రధాన్ నహీ చలేగా..”అంటూ నినదించి, కాశ్మీర్ భారత్ లోని అంతర్భాగమనీ నిరంతర పోరాటం చేసి అమరుడైన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ప్రసాద్ ముఖర్జీ పటాన్చెరు మాజీ జడ్పిటిసి బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని గురువారం ఇస్నాపూర్ లోని తన కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు జీవితం స్ఫూర్తిదాయకమని దేశ రాజకీయ చరిత్రలో నిలిచి ఉండే గొప్ప దాశనీకుడు అని ,ప్రధానంగా దేశంలోని షెడ్యూలు కులాలు, అనగారిన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. నేటితరం యువతరానికి, ప్రజాప్రతినిధులకు జగ్జీవన్ రామ్ ఆదర్శప్రాయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరువు మండలం ఉపాధ్యక్షుడు సాయికుమార్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు నరేందర్ గౌడ్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు జోగు ధనరాజ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి దీపక్ గౌడ్, మరియు యస్.ఆర్.కే యువసేన సభ్యులు షాపీ, శకిల్, రాము, కుమార్, అబ్దుల్, తదితరులు పాల్గొన్నారు.
