రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి :
రామచంద్రపురం పట్టణంలోని ఈద్గాలో ఉన్న బాబా బురానుద్దీన్ ష రహమతుల్లా అలై ఉర్సు ఉత్సవాలు నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. దర్గా నిర్వాహకులు మొహమ్మద్ నజీరుద్దీన్ సమక్షంలో అన్నదాన కార్యక్రమం. ఫాతిహా, చాదర్, గుల్, సమర్పించారు.ఉర్సు ఉత్సవాల్లో కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొని స్నేహ భావం చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ బాబా బురానుద్దీన్ ఆశీస్సులు పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలపై రామచంద్రపురం పట్టణ ప్రజలపై ఉండాలని అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో కుటుంబ సమేతంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు నసిరుద్దీన్, సోహెలుద్దీన్, ఇమ్రానుద్దీన్ చాంద్ హుస్సేన్, పాషా, ఖలీల్, పాషా మియా, లాలూ, ఏజాస, ఫారుక్, తాహెర్, హమీద్, తదితరులు పాల్గొన్నారు.