గురువందనం నాట్యం తో మెప్పించిన కళాకారులు…

Hyderabad

గురువందనం నాట్యం తో మెప్పించిన కళాకారులు…

హైదరాబాద్:

శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆర్ కేస్ కళానిలయం గురువర్యులు సుందరి రవి చంద్ర శిష్య బృందం చే గురువులందరికి “గురు వందన” భరతనాట్య ప్రదర్శనతో సమర్పించారు.గురువు త్రిమూర్తి స్వరూపుడు, బ్రహ్మ ల జ్ఞానాన్ని మనలో పుట్టించి, విష్ణు మూర్తి ల రక్షించి, శివుడిలా అజ్ఞానాన్ని తుంచి మంచి చెడులను విశదీకరించి, మానవతా విలువలను, సద్గుణాలను ఎలా పొందాలో నేర్పే వారు గురువులు. అలంటి గురువులను ఒక సరి మనసారా స్మరించుకొని, భరతనాట్య కళ ద్వారా గురువు లకి సుందరి రవిచంద్ర శిష్యులు వందన సమర్పణ చేశారు. పుష్పాంజలి, శ్లోకాలు, ఆనంద నర్తన గణపతిమ్, మధురాష్టకం, శంభో శివ శంభో, చక్కనితల్లికి , నారాయణతేయ్ నమో నమో, మానస సంచరరేయ్, విష్ణు స్తుతి, అచ్యుతం కేశవం, పలుకీ బంగారమాయెహ్ న, గోవిందర్శిత, శ్రీమాన్ నారాయణ, ఎందరో మహానుభావులు అంశాలను ప్రదర్శించి మెప్పించారు.
పాల్గొన్న కళాకారులు సాత్విక, మోక్ష వర్షిణి, హాసిని, శృతి, శ్రీదుల, సహస్ర, శాన్వి, నందిక, ప్రియాంక, కిరణ్మయి మొదలైన కళాకారులు ప్రదర్శించి మెప్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *