గూగుల్ ఉమెన్ ఇంజనీర్స్కు గీతం విద్యార్థుల ఎంపిక

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం మొదటి సంవత్సరం విద్యార్ధినులు అన్నా మొహమ్మర్, సందున్న బేతి, శ్రీప్రణతి మామిడి, సాయిత్రీ, కొడాలిలు గూగుల్ మద్ధతుతో నిర్వహిస్తున్న టాలెంట్ స్ప్రింట్ మహిళా ఇంజనీర్స్ (WE) ప్రోగ్రాము ఎంపికయ్యారు. ఈ విషయాన్ని గీతం కెరీర్ గెడ్లైన్స్ కేంద్రంలోని కాంపిటెన్సీ డెవలప్ మెంట్ డెరెక్టర్ డాక్టర్ రోజీనా మాథ్యూబుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. WE ప్రోగ్రామ్ అనేది మహిళా విద్యార్థులను ప్రపంచ స్థాయి ఇంజనీర్లుగా తీర్చిదిద్దే రెండేళ్ల కార్యక్రమమని,లక్ష రూపాయల స్కాలర్షిప్తో పాటు వంద శాతం ఫీజు మినహాయింపు ఉంటుందని ఆమె పేర్కొన్నారు. తను విద్యార్థులు ఈ ప్రోగ్రాన్కు ఎంపిక కావడానికి సహకరించిన తన సహోద్యోగులు- అసోసియేట్ డెలెక్టర్ ప్రొఫెసర్ రాజ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సంపత్లకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *