జ్యోతి స్కూల్ ప్రిన్సిపాల్ కు ఆచార్య దేవోభవ పురస్కారం

politics Telangana

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

విద్యార్థుల సర్వదోముకికి విశేష కృషి చేస్తున్న బి. హెచ్. ఈ. ఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరికి లీడ్ ఇండియా తెలంగాణ ఏంటర్ప్రెనుయర్స్ అసోసియేషన్ వారు ఆచార్య దేవోభవ పురస్కారం తో సత్కరించారు. రవీంద్ర భారతి లో జరిగిన ఓ కార్యక్రమంలో నిర్వాహకులు ఈ అవార్డును ఆమెకు అందజేశారు. ఎన్నో సంవత్సరాలనుండి జ్యోతి విద్యాలయలో టీచర్ గా పని చేసి బెస్ట్ టీచర్ అవార్డు అందుకొని అనంతరం అదే స్కూల్ కు ప్రిన్సిపాల్ అయి విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చి దిడ్డుతు వారి ఎదుగు దలకు పునాధులు వేస్తుంది. ఓ దశలో స్కూల్ మూత పడుతది అనుకునే స్థితికి చేరుకోగా, పూర్వ విద్యార్థుల సహకారం తో స్కూల్ కు పూర్వ వైభవం తీసుకువచ్చారు. అందరి సహకారం తో స్కూల్ ను మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్మo తో సి. బి. ఎస్ ఈ సిలబస్ కు మార్చి, దీనదినాభివృద్ధి దిశగా స్కూల్ ను ముందుకు తీసుకెళ్లడం పట్ల పలువురు వక్తలు ఆమెను అభినందించారు. ఆకుటింత దీక్షతో స్కూల్ అభివృద్ధి కి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న ఉమా మహేశ్వరీ మరిన్ని అవార్డులు, రివార్డులు ఎందుకోవాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *