వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను అందజేస్తున్న విజేత సూపర్ మార్కెట్

Hyderabad Lifestyle politics Telangana

మనవార్తలు ,శేరిలింగంపల్లి :

ప్రతీ వస్తువు కలుషితమవుతున్న ఈ రోజుల్లో వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను విజేత సూపర్ మార్కెట్ అందజేస్తుందని కొండాపూర్ బ్రాంచ్ భవన యజమాని కృష్ణారెడ్డి అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన 88 వ బ్రాంచ్ ను శుక్రవారం రోజు విజేత సూపర్ మార్కెట్ ఎం.డి జగన్మోహన్ రావు తో కల్సి ప్రారంభించారు. మెట్రో నగరమైన హైదరాబాద్ లో ఎన్నో షాపింగ్ మాల్స్ ఉన్నప్పటికీ వాటి పోటీని తట్టుకుని నేడు 88 వ బ్రాంచ్ ప్రారంభించడం అభినందించదగిన విషయమని, వినియోగదారుల మన్ననలు పొందుతూ ముందు ముందు మరిన్ని బ్రాంచ్ లను ఏర్పాటు చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇపుడున్న పోటీ ప్రపంచంలో వ్యాపారంలో రాణించాలంటే మాములు విషయం కాదని, అది అంకితభావం, దృఢ సంకల్పం ఉన్న జగన్మోహన్ రావు లాంటి వారికే సాధ్యమన్నారు. సుదీర్ఘ కాలం పాటు వ్యాపారం సాగి మంచి లాభాలు రావడంతో పాటు మరెంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *