పేదలకు మరో ఏడాది రేషన్ సరుకులు పంపిణీ చేయనున్న ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన_ బీజేపీ నేత గడీల శ్రీకాంత్ గౌడ్

politics Telangana

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

ప్రధాని నరేంద్ర మోడీ పేదలకు మరో ఏడాది నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ ప్రకటనపై పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ,బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
పటాన్ చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ లోని  తన కార్యాలయంలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలభిషేకం చేశారు.కరోనా సమయంలో గత రెండు సంవత్సరాలుగా ఉచితంగా ఇస్తున్న రేషన్ సరుకులనుమరో ఏడాది పొడగించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా నాయకులు దేవేందర్ గౌడ్ , వీరారెడ్డి,పటాన్ చెరు మండల బీజేపీ ఉపాధ్యక్షులు సాయికుమార్, జోగు ధన్ రాజ్, ఎస్ఆర్కే యువసేన సభ్యులు మచ్చ కిషోర్ రెడ్డి ,దుర్గా సాయి, సాయి కుమార్ , బండి నర్సింగ్ యాదవ్ , తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *