మనవార్తలు, శేరిలింగంపల్లి :
కాంక్రీట్ జంగిల్ గా మారిన నగరంలో, ఐటి కంపెనీల మధ్య. మాదాపూర్ లో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం తో ఏర్పడిన శిల్పారామం లో సందర్శకులకు వినోదాన్ని అందిస్తుంది. శిల్పారామం లో స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్ పో సందర్బంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా గురువారం రోజు డాక్టర్ రమాదేవి శిష్యు బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. శ్రీ మహాగణపతే, జతిస్వరం, హిరణ్మయీమ్ లక్షమీమ్ , రామ పట్టాభిషేక శబ్దం, మామవతు సరస్వతి, రామదాసు కీర్తన, సరసిజ నాబా మొదలైన అంశాలను డాక్టర్ రమాదేవి, డాక్టర్ అడ్తిరి, సౌమ్య, నిషిక, ప్రేరణ , యోగితా, మనస్విని, మానస, ఉన్నతి, అనన్య మొదలైన వారు ప్రదర్శించారు.