మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సెప్టెంబరు 15న మినీ హ్యాకథాన్, ఆటలు, ఆసక్తికరమైన కార్యక్రమాలతో ఇంజనీర్ల దినోత్సవం 2026ను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలలో వివిధ విభాగాల ఇంజనీరింగ్ విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు.భారతదేశపు అత్యంత ప్రసిద్ధ ఇంజనీర్లలో ఒకరు; నీటిపారుదల, నీటి నిర్వహణ, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి రంగాలలో మార్గదర్శకుడైన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ప్రతి యేటా సెప్టెంబరు 15న ఇంజనీర్ల దినోత్సవాన్ని పాటిస్తారు. ఈ సందర్భంగా, గీతం నాయకత్వం ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించింది.ఆవిష్కరణలు, సాంకేతికత, సుస్థిర పరిష్కారాల ద్వారా వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో ఇంజనీర్ల కీలక పాత్రను ఈ వేడుకలు చాటి చెప్పాయి. ఆవిష్కరణలను సుస్థిరతతో, సాంకేతికతను మానవత్వంతో, నైపుణ్యాన్ని సామాజిక బాధ్యతతో మేలవించే బాధ్యతాయుతమైన ఇంజనీర్లుగా ఎదిగి, సర్ ఎం. విశ్వేశ్వరయ్య వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఈ కార్యక్రమం విద్యార్థులను ప్రోత్సహించింది.మరింత వినూత్నమైన, సుస్థిరమైన, స్థితిస్థాపకమైన, సమ్మిళిత భారతదేశానికి దోహదపడే పరిష్కారాలను సృష్టించడం కొనసాగించాలని యువ ఇంజనీర్లకు సందేశంతో ఈ కార్యక్రమం ముగిసింది.

