మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
పటాన్చెరు మంజీరా క్యాంపస్ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం దత్తాత్రేయ స్వామి వారికి బాబా వారికి అభిషేకం సకల దేవత హవనం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు .అలాగే కీర్తిశేషులు దేవస్థానం వ్యవస్థాపకులు శ్రీశైలం మహారాజ్ గారి పాదుకల పూజ వాళ్ల శిష్యుడు ఆధ్వర్యంలో నిర్వహించారు . అనంతరం ఆలయ అర్చకులు మహేష్ స్వామి మాట్లాడుతూ గురువు చూపే మార్గమే మనిషిని అజ్ఞానాంధకారం నుంచి జ్ఞాన వెలుగులోకి నడిపిస్తుందని అన్నారు. గురువు బోధలను ఆచరణలో పెట్టినవారే నిజమైన శిష్యులని పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
