మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :
కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులకు ఇచ్చిన హామీని నిలబెడుతుందని ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బోర జ్ఞానేశ్వర్ అన్నారు.తెలంగాణ ఐక్య ముదిరాజ్ శేర్లింగంపల్లి నియోజకవర్గం ఖానా మెట్ శాఖ పదవి వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో ముదిరాజులకు బిసి-డి నుండి బిసి ఏలో చేర్చే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ బిసి సమాజంలో మొదటి వరుసలో ఉన్న ముదిరాజులు రాజకీయంగా ఇంకా వెనుకబడి ఉన్నారని ముదిరాజులకు మంచి అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం ముదిరాజులకు ఎలాంటి మేలు చేయలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ కుటుంబ సర్వే నిర్వహించి తెలంగాణలో ఉన్న వివిధ సామాజిక వర్గాల స్థితిగతులపై సమగ్ర నివేదిక ఇచ్చిందని ఆయన తెలిపారు. ఆ నివేదిక ప్రకారం సామాజిక వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. ముదిరాజ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివయ్య ముదిరాజ్ మాట్లాడుతూ జనాభా లెక్కల ప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం ముదిరాజు లెక్కన చూపించడం చాలా సంతోషకరమైన విషయమని అదే విధంగా ముదిరాజ్ వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తులకు ప్రభుత్వం వెనువెంటనే పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, శేర్లింగంపల్లి కాంగ్రెస్ నేర్కవర్గం ఇన్చార్జి జగదీష్ గౌడ్,ఖానా మెట్ శాఖ అధ్యక్షులు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఆలయ కమిటీ అధ్యక్షులు సతీష్ ముదిరాజ్, రాష్ట్ర నాయకులు వివిధ ముదిరాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
