శారద విద్యానికేతన్ స్కూల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు

politics Telangana

 

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : నాగార్జున గ్రూప్ ఆఫ్ స్కూల్స్ శారదా విద్యానికేతన్ లో సోమవారం రోజు వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులచే సరస్వతీ పూజ, హోమం మరియు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. నూతనంగా అక్షరాభ్యాసం చేసిన చిన్నారులకు కరస్పాండెంట్ పూర్ణిమ పలకలు, స్కూల్ యూనిఫామ్ మరియు బహుమతులను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పండగ విశిష్టత గురించి ప్రధానోపాధ్యాయురాలు నీరజ విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు హరిత, వరలక్ష్మి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *