రామచంద్రపురం :
శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి కరోనా కాలంలో కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ తరపున ప్రజలకు అందించిన వివిధ సేవలను గుర్తించి ఆదివారం రోజు చిదంబరం నటరాజ కళా నిలయం రజతోత్సవ వేడుకలు తెలంగాణ సారస్వత పరిషత్ అబిడ్స్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రజలకు అందించిన వివిధ సామాజిక సేవలను గుర్తిస్తూ కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి కి కేంద్ర అధికార ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీ డాక్టర్ ఎస్ వేణుగోపాల చారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుజేశారు.
ఈ సందర్భంగా కృష్ణమూర్తి చారి మాట్లాడుతూ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి స్ఫూర్తి అందిస్తుందని ఫౌండేషన్ పై మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా గత 9 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, రానున్న రోజుల్లో కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఆత్మవిశ్వాసంతో, బాధ్యతతో నిర్వర్తిస్తామని అన్నారు. సేవలో వుండే సంతృప్తి మానసిక పునరుత్తేజానికి నాంది పలుకుతాయని, ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు వుంటాయని తెలియచేశారు.చిదంబరం నాట్య గురువు ఫౌండర్ సెక్రెటరీ మంజుల కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.