మనవార్తలు , శేరిలింగంపల్లి :
మత్స్య కారుల కష్టసుఖాల్లో పాలుపంచుకోడానికి నూతనంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేయటానికి కృషి చేస్తున్నామని ముదిరాజ్ సంఘం సభ్యులు పేర్కొన్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపనపల్లి గ్రామంలో గల ముదిరాజ్ సంఘం సభ్యులకు వృత్తి నైపుణ్య పరీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సుకీర్తి , కో-ఆపరేటివ్ అధికారులు, రంగారెడ్డి జిల్లాలోని సహకార సంఘం అధ్యక్షులు శ్రీరాములు, కుమార్, సురేష్ ,ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్ ఫీల్డ్ ఆఫీసర్ పాల్గొన్నారు. గోపనపల్లి మత్స్యకారులు శంకరి రాజు ముదిరాజ్, రంగస్వామి, విక్రమ్, కే.రంగస్వామి, రమేష్, అనంత, శ్రీకాంత్, వెంకట్, కె నగేష్, ప్రకాష్, శివ కుమార్, శ్రీను, నవీన్, ప్రవీణ్,కె మధు, ఎస్ అనంతయ్య,ఎస్ రాజు, ముదిరాజు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.