మనవార్తలు ,బొల్లారం:
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలో భారతీయ జనతా నేషనల్ పార్టీ,రాష్ట్ర పార్టీ మరియుజిల్లా పార్టీ ఆదేశాల మేరకు పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బొల్లారం మున్సిపల్ మహిళా మోర్చా అధ్యక్షురాలు డి. స్రవంతి రెడ్డి ఆధ్వర్యంలో బొల్లారం మున్సిపల్ పట్టణ అధ్యక్షులు కేజెఆర్ ఆనంద్ క్రీష్ణారెడ్డి చేతుల మీదుగా ఆశా, అంగన్వాడీ వర్కర్లను సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కార్యవర్గ సభ్యురాలు టీ. మేఘన రెడ్డి, కే.సరస్వతి,సీనియర్ నాయకులు టీ. రవీందర్ రెడ్డి, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి జి. శారదా, అంగన్వాడీ టీచర్లు ప్రసన్న, ప్రదీపా, భూ లక్ష్మి, మౌనిక, ఆశా వర్కర్లు భాగ్య, సారమ్మ, సుజాత, అనిత,విజయ లక్ష్మి,దేవమ్మ,అంజలి, విజయ లక్ష్మి, గిరిజ, సరస్వతి, బొల్లారం మున్సిపల్ ఎంపిహెచ్ విజయ లక్ష్మి,ఆయా జయ,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
