మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ని గెలిపించాలి_బీసీ సంఘం నేత, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య.

-హైదరాబాదులో ఆర్ కృష్ణయ్యను కలిసిన నీలం మధు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : బీసీలు అందరూ ఏకమై మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని జాతీయ బీసీ సంఘం నేత, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య కోరారు. మంగళవారం హైదరాబాద్ లోని ఆర్ కృష్ణయ్య నివాసానికి విచ్చేసిన ఎంపీ అభ్యర్థి నీలం మధును ఆర్ కృష్ణయ్య సాదరంగా స్వాగతించి అభినందించారు. ఎంపీ ఎన్నికల్లో పూర్తి సహాయ సహకారాలు అందించి, తనకు […]

Continue Reading

గణితంపై పట్టు – విజయానికి తొలి మెట్టు

-పాఠశాల విద్యార్థులకు గణితం, సెన్స్ ప్రాముఖ్యతలను వివరించిన గీతం విద్యార్థులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : వ్యక్తుల విశ్లేషణాత్మక సామర్థ్యాలను రూపొందించడంలో, పోటీ పరీక్షలను వారిని సిద్ధం చేయడంలో గణిత శాస్త్రం క్రియాశీలక భూమిక పోషిస్తోందని, గణితంపై పట్టు విజయానికి తొలి మెట్టుగా గీతం విద్యార్థులు అభివర్ణించారు.గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ విద్యార్థులు మంగళవారం రుద్రారంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో గణితం, సెన్స్ ప్రాముఖ్యతను వివరించడానికి ఉద్దేశించిన ఔట్రచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ […]

Continue Reading

సమాజంలో న్యాయవాది పాత్ర కీలకమైనదని..

– టీఎస్ లా సెట్ కన్వీనర్ ఓయూ, డీఎన్( ఫ్యాకల్టీ ఆఫ్ లా) విజయలక్ష్మి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సమాజంలో న్యాయవాది పాత్ర కీలకమైనదని టీఎస్లా సెట్ కన్వీనర్ ఓయూ, డీఎన్( ఫ్యాకల్టీ ఆఫ్ లా) విజయలక్ష్మి అన్నారు.పటాన్‌చెరు మండలం ముత్తంగి లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో విశ్వ భారతి న్యాయ కళాశాల మొదటి,రెండో సంవత్సర విద్యార్థులు ఫైనల్ఇయర్ విద్యార్థులకు ఇచ్చిన వీడ్కోలు సమావేశానికి లా సెట్ కన్వీనర్, ఓయూ డీఎన్ విజయలక్ష్మి, […]

Continue Reading

గీతం స్కాలర్ చిద్విలాస్ కూరపాటికి పీహెచ్ డీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ,హైదరాబాద్ లోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి చిద్విలాస్ కూరపాటిని. డాక్టరేట్ వరించింది. ‘క్రోమోన్ డెరివేటివ్ ల సంశ్లేషణ: భవిష్య క్యాన్సర్ నిరోధక కీమోథెరఫీ పద్ధతి అభివృద్ధి, జీవ మూల్యాంకనం’ అనే అంశంపై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ జి.రాంబాబు శనివారం విడుదల చేసిన ప్రకటనలో’ ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ […]

Continue Reading

ఆనం మీర్జా ఆధ్వర్యంలో దావత్-ఎ-రంజాన్ పేరుతో హైదరాబాద్ లో అతిపెద్ద రంజాన్ ఎక్స్‌పో

_ప్రారంభించిన బాలీవుడ్ నటి రవీనా టాండన్ _మార్చి 27 నుండి ఏప్రిల్ 10 వరకు 14 రోజుల పాటు ఈ ప్రదర్శన   మనవార్తలు ,హైదరాబాద్: రంజాన్ పర్వదినం నేపథ్యంలో “దావత్-ఎ-రంజాన్” పేరుతో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా అధ్వర్యంలో మెహిదీపట్నంలోని కింగ్ ప్యాలెస్ లో 14రోజుల పాటు ఎక్స్పో నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ ప్రారంభించారు. ఈ నైట్ బజార్ ప్రదర్శన లో పిల్లలు మహిళలతో […]

Continue Reading

న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా 

– బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికైన విష్ణువర్ధన్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికైన విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఎనిమిదవ సారి విష్ణువర్ధన్ రెడ్డి ని అధ్యక్షునిగా, ఉపాధ్యక్షునిగా సూర రెడ్డి, జనరల్ సెక్రెటరీగా అంబ్రిష్, జాయింట్ సెక్రటరీగా రమేష్, ట్రెజరర్ గా మాధవి ,లైబ్రరీ సెక్రటరీగా ఆంజనేయులు, లేడీ రిప్రజెంటేటివ్ గా లలిత,30 ఇయర్స్ […]

Continue Reading

సాంకేతిక నైపుణ్యాల మెరుగుదల కోసం

-బీఈఎక్స్ఎల్ తో గీతం అవగాహన పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడానికి గాను బీఈఎక్స్ఎల్ ఇండియా కన్సల్టింగ్ తో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం అవగాహన ఒప్పందం చేసుకుని, తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించాయి. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరక్టర్. ప్రొఫెసర్ సి.ఆర్.శాస్త్రిల సమక్షంలో ఈ అవగాహన కుదిరింది. గీతం బీఈఎక్స్ ఎల్ ల మధ్య సహకారం భారతీయ నిర్మాణ పరిశ్రమలో […]

Continue Reading

రోడ్డు ఆక్రమణతో ట్రాఫిక్ రద్దీ

– రోడ్డును ఆక్రమించి వ్యాపారం చేస్తున్న అక్రమార్కులు – ఆక్రమణలు తొలిగించాలని కాలనీ వాసుల డిమాండ్ మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : వివిధ కాలనీలకు సాఫిగా రాకపోకలు సాగించేందుకు వీలుగా అప్పట్లోనే వంద ఫీట్ల వెడల్పు రోడ్డును ఏర్పాటు చేశారు. కాలనీల్లో ప్రజల జనాభా పెరిగింది. కాలనీలు, బస్తీలు పెరిగాయి. ఇదే అధనుగా భావించిన అక్రమార్కులు వంద ఫీట్ల విస్తీర్ణం కలిగిన రోడ్డును యాదేచ్చగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి వ్యాపారం చేస్తూ ట్రాఫిక్ జాం కు కారకులవుతున్నారు. […]

Continue Reading

2030 నాటికి మానవ మేధస్సుతో సరిపోలే కృత్రిమ మేధస్సు 

– గీతం కార్యశాలలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సిబా ఉద్గత పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రానున్న ఐదారేళ్లలో, బహుశా 2030 నాటికి మానవ మేధస్సుతో కృత్రిమ మేధ (ఏఐ) సరిపోలుతుందని, ప్రస్తుతం అది మనం నిర్దేశించిన పని చేయడానికే పరిమితమైందని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, ఏఐలో ప్రఖ్యాత నిపుణుడు డాక్టర్ సిబా ఉద్గత అంచనా వేశారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లొని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘కృత్రిమ మేధ, లార్జ్ […]

Continue Reading

భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వైవిధ్యభరితం

=ఆతిథ్య ఉపన్యాసంలో ప్రొఫెసర్ మధుర స్వామినాథన్ – త్రిపుర రైతులపై పుస్తకావిష్కరణ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వైవిధ్యభరితమైనదని, వ్యవసాయ వర్గ సంబంధాలపై చారిత్రక, ఆర్థిక ప‌రిస్థితుల ప్రభావాన్ని గుర్తించాల్సిన ఆవశ్యకత ఉందని డాక్టర్ మధుర స్వామినాథన్ అన్నారు. బెంగళూరులోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ ప్రొఫెసర్, ఆర్థిక విశ్లేషణ విభాగాధిపతి అయిన ఆమె మంగళవారం ‘సమకాలీన భారతదేశంలో వ్యవసాయ సంబంధాలు’ అనే అంశంపై అతిథ్య ఉపన్యాసం చేశారు. గీతం స్కూల్ […]

Continue Reading