గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు తన విద్యార్థుల విద్యా ప్రయాణంలో ఒక కీలక ఘట్టాన్ని సూచించే 17వ పట్టభద్రుల ప్రదానోత్సవం (గ్రాడ్యుయేషన్ డే)ను ఆగస్టు 1, 2026న (శనివారం) నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని గీతం రిజిస్ట్రార్ డాక్టర్ డి. గుణశేఖరన్ బుధవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.2025-26 విద్యా సంత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ), పీహెచ్.డీ. కోర్సులను విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులు ఈ పట్టభద్రలు […]

Continue Reading

వైద్యులు సమాజానికి రక్షకులు తెలంగాణ రాష్ట్ర యూత్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కష్టకాలంలో ప్రాణాలు నిలిపే డాక్టర్లు ప్రత్యక్ష దైవాలని తెలంగాణ రాష్ట్ర యూత్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి అన్నారు . బుధవారం పటాన్‌చెరు పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థ యూరో కిడ్స్ లో ‘నేషనల్ డాక్టర్స్ డే’ వేడుకలకు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు .చిన్నారి విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు . అనంతరం మాట్లాడుతూ సమాజంలో వైద్యులకు అత్యున్నతమైన స్థానం ఉందనీ, కష్టకాలంలో ప్రాణాలు నిలిపే డాక్టర్లు ప్రత్యక్ష దైవాలనీ, ప్రతి […]

Continue Reading

కొత్త పింఛన్లకు మోక్షం ఎప్పుడు? నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షులు తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కొత్త పింఛన్లకు మోక్షం ఎప్పుడని నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షులు తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 30 నెలలు పూర్తవుతున్నా, సామాజిక భద్రతా పింఛన్ల విషయంలో కొత్తగా అర్హత పొందిన వేలాది మంది నిరుపేదలు ఇంకా ఎదురుచూపుల్లోనే ఉన్నారని ఎన్నికల సమయంలో సామాజిక పింఛన్లను పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ఇప్పటికీ […]

Continue Reading

గీతం విద్యార్థిని నివేదితకు గాంధీ ఫెలోషిప్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రతిష్టాత్మక గాంధీ ఫెలోషిప్ ప్రోగ్రామ్ నకు, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఎం.ఏ. ఎకనామిక్స్ విద్యార్థిని ఆర్. నివేదిక ఎంపికైంది. ఈ విషయాన్ని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయ వర్గాలు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించాయి. న్యూఢిల్లీలోని పిరమల్ ఫౌండేషన్ అందించే, జాతీయంగా గుర్తింపు పొందిన నాయకత్వ కార్యక్రమం ఇదని, సామాజిక పరివర్తనకు కట్టుబడి ఉన్న యువతలో మార్పును ప్రోత్సహిస్తుందని వివరించారు. గాంధీ ఫెలోషిప్ అనేది […]

Continue Reading

సిగాచీ పరిశ్రమ పేలుడు మృతులకు సంపూర్ణ నష్టపరిహారం చెల్లించాలి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

ఏడాది గడిచిన అమలుకు నోచుకోని సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల హామీ పరిశ్రమ యాజమాన్యానికి బంటుగా రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు నిరంతర సహకారం బిపిఎల్ చౌరస్తాలో సిగాచి మృతులకు ఘన నివాళి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిగాచి దుర్ఘటన జరిగి ఏడాది గడిచిన నేటి వరకు మృతుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం అందించడంలో పరిశ్రమ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయని ఇది అత్యంత దుర్మార్గమని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం […]

Continue Reading

ప్రతి కాలనీ సమగ్ర అభివృద్ధి మా ధ్యేయం పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి 

అమీన్పూర్ డివిజన్ పరిధిలోని సన్ వే ఓపస్, ప్రైడ్ పార్కు కాలనీలో 5 కోట్ల 20 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన అమీన్పూర్, మనవార్తలు ప్రతినిధి : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని ప్రతి కాలనీని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ప్రైడ్ పార్కు కాలనీ, సన్ వే ఓపస్ కాలనీలలో ఐదు కోట్ల […]

Continue Reading

గణితశాస్త్రంలో నరేందర్ సత్వాయికి పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి నరేందర్ సత్వాయి డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘పారగమ్య సంకుచిత నాళికలలో నాన్-న్యూటోనియన్ ద్రవ ప్రవాహాల గణిత పరిశీలన’పై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణిత శాస్త్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కె. మారుతీ ప్రసాద్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని […]

Continue Reading

సిగాచీ బాధితులకు పూర్తి నష్టపరిహారం వెంటనే చెల్లించాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

సీఎం రేవంత్ రెడ్డి సిగాచీ బాధితులకు ఇచ్చిన కోటి రూపాయలు హామీ నెరవేర్చరా..?? పాశమైలారం పారిశ్రామిక వాడలోని బిపిఎల్ చౌరస్త వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సిగాచీ బాధిత కుటుంబాలతో ర్యాలీ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సీఎం రేవంత్ రెడ్డి సిగాచీ బాధితులకు ఇచ్చిన కోటి రూపాయలు హామీ నెరవేర్చరా..?? అని సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. సిగాచీ ప్రమాద బాధితులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని […]

Continue Reading

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలి మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో ది మాస్టర్ మైండ్స్ స్కూల్ నూతన బ్రాంచ్ ను స్కూల్ చైర్మన్ రాజు సంఘాని, ప్రిన్సిపాల్ నాగరాజు లతో కలిసి ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. విద్యార్థులకు అన్ని రకాల నాణ్యమైన విద్యను స్కూల్ యాజమాన్యం […]

Continue Reading

సిగాచి ఇండస్ట్రీస్ ప్రమాద బాధితులకు పూర్తి న్యాయం చేయాలి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి మెట్టు శ్రీధర్ విజ్ఞప్తి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: 2025 జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారం లోని సిగాచి ఇండస్ట్రీస్‌లో జరిగిన ఘోర పారిశ్రామిక ప్రమాదానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా, బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ శ్రీ జి. కిషన్ రెడ్డి గారికి వినతిపత్రం సమర్పించినట్లు నవభారత్ నిర్మాణ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు, యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ తెలిపారు.మరణించిన […]

Continue Reading