– బ్యాగులు, బుక్కులు అందజేత
మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :
తాము సంపాదించిన దాంట్లో కొంత పేదవారి చదువులకు ఉపయోగించాలనే సేవా భావం తో కొందరు యువతి, యువకులు ముందుకు వచ్చారు. నిర్మాణ్ ఆర్గనైజేషన్ మరియు ఓపెన్ టెక్స్ట్ సంయుక్తంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ద్వారా శేరిలింగంపల్లి ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల విద్యార్థులకు చేయుతనందిoచారు. ప్రభుత్వ పాఠశాలలొ చదువుతున్న విద్యార్థులకు బడి పునఃప్రారంబ కావడంతో సేవా కార్యక్రమంలో భాగoగా పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, వారిని ప్రోత్సహించడానికి స్కూల్ బ్యాగులు, పెన్సిల్స్, నోట్ బుక్స్, క్రిటన్ కిట్స్, డిజిటల్ స్లాట్స్ వంటి వాస్తులు వారికి సేవా భావం కార్యక్రమంలో భాగంగా పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ యూనియన్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, హెడ్ మాస్టర్ అనుపమ, జగన్ మరియు శ్రీకాంత్ మరియు ఓపెన్ టెక్స్ట్ నుండి సతీశ్ వారి 30 మంది బృందం పాల్గొని పిల్లల చదువు లు మెరుగుపడడానికి తోడ్పడుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి శ్వేత శరణ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.
